Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

corona visus
, సోమవారం, 19 సెప్టెంబరు 2022 (10:38 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 4,858 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరణాలు నమోదుకాగపోగా, ఈ వైరస్ నుంచి 4,735 మంది విముక్తులయ్యారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 48,028 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 4,39,62,664 మంది కోలుకున్నారు. మొత్తం 5,28,355 మంది కరోనాతో మృతి చెందారు. 
 
దేశంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 2.76 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.71 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాలు రేతు మాత్రం 1.19 శాతంగా, క్రియాశీలక రేటు 0.11 శాతంగా ఉన్నట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,16,7,14,127 డోసుల కరోనా టీకాలను పంపిణీ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు - ఆ దేశాలకు నో ఆహ్వానం