Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సరికొత్త చరిత్ర సృష్టించిన భజరంగ్ పూనియా

Bajrang Punia
, సోమవారం, 19 సెప్టెంబరు 2022 (08:26 IST)
భారతస్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రతిష్టాత్మక ప్రపంచ సీనయిర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలను గెలుచుకున్నాడు. తద్వారా భారత తొలి రెజ్లర్‌గా నిలిచాడు. 
 
ఆదివారం సెర్బియాలోని బెల్ గ్రేడ్‌లో ముగిసిన తాజా సీజన్‌లో పూనియ అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. పురుషుల ఫ్రీ స్టయిల్ 65 కేజీల విభాగంలో పూనియా ఈ పతాకాన్ని కైవసం చేసుకున్నాడు. వాస్తవానికి ఈ టోర్నీలో పూనియా క్వార్టర్ ఫైనల్‌లోనే ఓటమిపాలయ్యాడు. కానీ, అతడిని ఓడించిన అమెరికా రెజ్లర్ జాన్ మైఖేల్ ఫైనల్ చేరుకోవడంతో భారత రెజ్లర్‌కు రెజిచేజ్ ద్వారా కాంస్య పతకం వరించింది. 
 
రెజిచేజ్‌ను పూనియా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తొలి బౌట్లో 7-6తో ఆర్మేనియాకు చెందిన వాజ్‌ బెజ్ తెవాన్యన్‌పై  నెగ్గి కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. ఆ తర్వాత జరిగిన కాంస్య పతక బౌట్‌లో పూనియ్ 11-9తో ప్యూర్టోరికోకు చెందిన సెబాస్టియన్ రెవిరా విజయం సాధించి పతకం గెలుచుకున్నారు. 
 
అలాగే, గత 2013లో 60 కేజీల విభాగంలో కాంస్యం, 2018లో 65 కేజీల విభాగంలో రజతం గెలిచిన బజ్ రంగ్ 2019లో కాంస్యం గెలిచాడు. మొత్తం ఏడు సార్లు పోటీపడ్డ అతను నాలుగు పతకాలతో ప్రపంచ చాంపియన్ షిప్ లో అత్యంత విజయవంతమైన భారత రెజ్లర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహ్మద్ షమీకి కరోనా వైరస్ - టీ20కి దూరం