Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేబీసీ సీజన్ -14లో రూ.కోటి గెలుచుకున్న గృహిణి

kavitha chawla
, ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (21:52 IST)
"కోన్ బనేగా క్రోర్‌పతి" 14వ సీజన్ క్విజ్ పోటీలు గత నెల 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో చాలా మంది పోటీదారులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నటుడు అమితాబ్ బచ్చన్ ప్రశ్నలు అడుగుతూ షోకు నాయకత్వం వహిస్తున్నారు. తొలి ఎపిసోడ్‌లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నటుడు అమీర్ ఖాన్, బాక్సర్ మేరీకోమ్, క్రీడాకారుడు సునీల్ ఛెత్రి, మేజర్ డి.పి. సింగ్, "వీరనారి" అవార్డు అందుకున్న తొలి మహిళా అధికారిణి మిథాలీ మధుమిత కూడా ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. 
 
ఈ కార్యక్రమంలో తొలిసారిగా కవితా చావ్లా అనే మహిళ కోటి రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకుంది. కవిత మహారాష్ట్రలోని కొల్హాపూర్ నివాసి. ఇంటి పెద్ద అయిన ఆమె ప్లస్ 2 వరకు చదువుకుంది. అయితే ఆ ఘనత సాధించాలనే ప్రయత్నంలో సఫలమైంది. 
 
ఇతరులకు ఆమె ఆదర్శం. ఈ ఎపిసోడ్ పతి సోమ, మంగళవారాల్లో సోనీ టీవీలో రాత్రి 9 గంటలకు ప్రసారంకానుంది. అయితే, ఈ షో ఇంతటితో ముగిసిపోలేదు. కవిత తదుపరి ప్రశ్నకు సరైన సమాధానం చెబితే, ఆమె ఏకంగా 7.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్న ప్రభాస్?