Webdunia - Bharat's app for daily news and videos

Install App

లలిత్ మోదీ బెంగళూరుకు ఆడకపోతే కెరీర్ నాశనం చేస్తానన్నాడు..

సెల్వి
మంగళవారం, 9 జనవరి 2024 (14:29 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి సీజన్‌లో ఢిల్లీ తరఫున ఆడాలనుకుంటున్నట్లు టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్ తెలిపాడు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) టీమ్‌తో ఉండాల్సిందిగా ఐపీఎల్ బాస్ లలిత్ మోడీ బెదిరించాడని ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశాడు. బెంగళూరు చాలా దూరంలో ఉందని, అక్కడి ఆహారం తనకు సరిపడదని వివరించాడు. 
 
ఐపీఎల్‌ నుంచి ఎవరో పేపర్‌పై తన సంతకం తీసుకున్నారని ప్రవీణ్‌ తెలిపాడు. అయితే అది కాంట్రాక్ట్ పేపర్ అని అతనికి అప్పుడు తెలియదు. అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ.. లలిత్ మోదీ తనకు ఫోన్ చేసి బెంగళూరు జట్టుకు ఆడకపోతే ఐపీఎల్‌లో కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడని చెప్పాడు. తాజాగా ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు.
 
 క్రికెట్‌లో బాల్ ట్యాంపరింగ్ సర్వసాధారణమని ప్రవీణ్ కుమార్ అన్నారు. 
 
ట్యాంపరింగ్ 1990లలో మొదలైంది. దాదాపు ప్రతి ఫాస్ట్ బౌలర్ రివర్స్ స్వింగ్ సాధించేందుకు ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నాడని వివరించాడు. 
 
ఈ విషయం అందరికీ తెలుసునని ప్రవీణ్ అన్నాడు. ఇప్పుడు మైదానం అంతా కెమెరాలు ఉండడంతో మైదానంలో ప్రతి ఆటగాడి చిన్నపాటి కదలికలు కూడా రికార్డు అవుతున్నాయని, ట్యాంపరింగ్ ఆరోపణలు ఎక్కువయ్యాయన్నారు. 
 
అందరూ చేస్తున్నప్పటికీ పాక్ ఆటగాళ్లు ఇందులో ప్రమేయం ఉన్నారని తాను విన్నానని, ట్యాంపరింగ్ ఎక్కువగా చేసేది వాళ్లేనని ప్రవీణ్ చెప్పాడు.

సంబంధిత వార్తలు

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments