Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో విజృంభిస్తున్న కరోనా.. వుహాన్ ఆస్పత్రి డైరెక్టర్ మృతి

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (13:31 IST)
చైనాలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తంది. ఈ వైరస్ ధాటికి ఏకంగా ఆస్పత్రి డైరెక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో సామాన్య ప్రజానీకం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇట్టే తెలుసుకోవచ్చు. 
 
చైనాలోని వూహాన్ నగరం కరోనా వైరస్‌కు కేంద్రంగా ఉన్న విషయం తెల్సిందే. ఈ నగరంలోని వుహాన్ ఆసుపత్రి డైరెక్టర్‌గా లియు జిమింగ్ ఉన్నారు. ఈయనకు వైరస్ బారినపడి మంగళవారం కన్నుమూశారు. ఇలా ఒక ఆసుపత్రి డైరెక్టరే ఈ వ్యాధిగ్రస్తుడై మృతి చెందడం ఇదే మొదటిసారి. 
 
మరో ఆరుగురు మెడికల్ వర్కర్లు కూడా ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కాగా లియు మృతికి సంబంధించిన వార్తలు మంగళవారం అర్ధరాత్రి సర్క్యులేట్ కాగా ఆ తర్వాత వాటిని డిలీట్ చేశారు. వాటి స్థానే.. డాక్టర్లు ఆయనకు ఇంకా చికిత్స చేస్తున్నారనే సమాచారంతో వాటిని భర్తీ చేశారు. 
 
అయితే చివరకు ఆయన మరణాన్ని ధృవీకరించారు. కరోనా వైరస్ గురించి మొదట వెలుగులోకి తెచ్చిన నేత్ర వైద్యుడు లీ వెన్లియాంగ్‌ను అధికారులు గత డిసెంబరులో శిక్షించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన మరణించాడు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments