Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై.. గూగుల్ సంచలనం

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (12:55 IST)
భారత్‌తో పాటు పలు దేశాల్లో రైల్వే స్టేషన్లలో అందించే ఉచిత వైఫై సేవలను ఆపేయాలని గూగుల్ నిర్ణయించింది. గత 2015 నుంచి భారత్‌తో పాటు ఇతర దేశాల రైల్వేస్టేషన్లలో రైల్వేశాఖతో చేతులు కలిపిన గూగుల్ ఉచిత వైఫై సేవలను అందిస్తోంది. వైఫై సేవలను తొలి విడతగా 400 రైల్వేస్టేషన్లలో ఆపేయనుంది గూగుల్. ఆపై విడతల వారీగా ఉచిత సేవలను ఆపేయాలని గూగుల్ నిర్ణయించుకుంది. 
 
ముందుగా భారత్‌లో ఈ సేవలను నిలిపేయాలని తీర్మానించింది. ఈ విషయాన్ని బ్లాగులో గూగుల్ తెలిపింది. ప్రపంచ దేశాల్లో అత్యధిక డేటాను వాడే దేశాల్లో భారత్ అగ్రస్థానంలో వుండగా.. ఇక్కడ చౌక ధరకే డేటా లభిస్తున్న కారణంగా ఉచిత డేటా అవసరం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు గూగుల్ వెల్లడించింది. టాటా గ్రూప్, పవర్ గ్రిడ్ సంస్థలు భారత్‌లో ఉచిత సేవలను అందిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments