Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిందాల్ గ్రూప్ ఉద్యోగి.. విమానంలో నా శరీరాన్ని అభ్యంతరకరంగా తాకాడు..

సెల్వి
శనివారం, 20 జులై 2024 (14:15 IST)
మహిళలపై అకృత్యాలు ఎక్కడపడితే అక్కడ జరుగుతుంటాయి. తాజాగా జిందాల్ గ్రూప్ సంస్థ సీనియర్ అధికారి మహిళా వేధింపుల వ్యవహారంలో చిక్కుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. కోల్‌కతా నుంచి అబుదాబీ వెళ్తున్న విమానంలో జిందాల్ గ్రూప్ సంస్థ సీనియర్ అధికారి ఒకరు తనను అసభ్యకరంగా తాకారని ఓ ప్రయాణికురాలు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేసింది. 28 ఏళ్ల బాధితురాలు.. తనకు విమానంలో పరిచయమైన వ్యక్తి దినేశ్ ఆర్ అని.. ఆయనకు 65 ఏళ్లు వుండవచ్చునని ఎక్స్‌లో తెలిపింది.  
 
తొలుత తన హాబీల గురించి చెప్పిన ఆయన, తన సెల్‌ఫోన్‌లో కొన్ని వీడియోలు ఉన్నాయంటూ అసభ్య చిత్రాలు చూపించాడని పేర్కొంది. తాను షాకైపోయిన సమయంలో శరీరం చుట్టూ చేతులేసి అసభ్యకరంగా తాకాడని పేర్కొంది.
వెంటనే తాను తేరుకుని వెళ్లి క్రూ సిబ్బందికి ఫిర్యాదు చేశానని, వారు పోలీసులకు సమాచారం అందించారని తెలిపింది. 
 
విమానం అబుదాబీలో దిగే సమయానికి పోలీసులు అక్కడ సిద్ధంగా ఉన్నారని, అయితే, తను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే బోస్టస్ ఫ్లైట్ మిస్సయ్యే అవకాశం ఉండటంతో కంప్లయంట్ ఇవ్వలేదని చెప్పుకొచ్చింది.
 
అయితే, తనకు ఎదురైన పరిస్థితి మరెవ్వరికీ ఎదురు కాకూడదనే ఉద్దేశంతో ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు తెలిపింది. దీనిపై జిందాల్ గ్రూప్ చైర్మన్ స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించానని, తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments