Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుపతిలో ముసుగు దొంగలు.. వ్యాపారి ఇంట్లో చొరబడి మహిళను చంపేశారు..!

murder

సెల్వి

, శుక్రవారం, 19 జులై 2024 (10:30 IST)
తిరుపతిలో ముసుగు యువకుల దాడిలో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా, బాలికకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నగరంలోని రాయల్ నగర్‌లో గురువారం వ్యాపారి శ్రీనివాస్ ఇంట్లోకి వృద్ధురాలు, బాలిక మినహా కుటుంబ సభ్యులందరూ లేని సమయంలో ముసుగు ధరించిన యువకుడు చొరబడ్డాడు. 
 
ఇంట్లో ఉన్న మహిళ, బాలికపై దాడి చేశాడు. కత్తి దాడిలో 75 ఏళ్ల జయలక్ష్మి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక నియాతి (12) తీవ్రంగా గాయపడగా, ఆమెను ఆసుపత్రికి తరలించారు. దాడి అనంతరం యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
దాడి చేసిన వ్యక్తి ఒంటరిగా వచ్చాడా లేక ఇతరులతో వచ్చాడా అనేది తెలియరాలేదు. రెండేళ్ల క్రితం ఈ వ్యాపారి కుటుంబ సభ్యులపై కూడా ఇదే తరహాలో కత్తి దాడి జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. 
 
పోలీసు సిబ్బందితో కలిసి ఎస్పీ ఇంటిని పరిశీలించారు. ఇప్పటికే వరకు చిక్కిన ఆధారాల ఆధారంగా దుండగుడిని పట్టుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సస్పెండ్ అయిన కె.శాంతి వ్యక్తిగత జీవితంతో సంబంధం లేదు : దేవాదాయ మంత్రి ఆనం