Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో భారీ మంచు తుఫాను

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (11:39 IST)
పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో భారీ మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. దాదాపు  ఒక మీటర్ మేరకు మంచు కురిసింది. దీంతో ప్రముఖ హిల్ స్టేషన్‌గా ఉన్న ముర్రీలో పర్యటిస్తున్న పర్యాటకుల్లో అనేక మంది ఈ ముంచు తుఫానులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పది మంది చిన్నారులతో పాటు.. మొత్తం 22 మంది వరకు ఉన్నట్టు పంజాబ్ ప్రావిన్స్ అధికారులు వెల్లడించారు. దీంతో హిల్ స్టేషన్ ముర్రీని విపత్తు ప్రాంతంగా శనివారం ప్రకటించారు. 
 
ఈ ముంచు తుఫాను కారణంగా ముర్రే రహదారుల్లో వేలాది సంఖ్యలో వాహనాలు రోడ్లపై బారులు తీరాయి. దాదాపు వెయ్యికి పైగా కార్లు ఈ హిల్ స్టేషనులో చిక్కుకునిపోయాయి. దీంతో అప్రమత్తమైన పంజాప్ ప్రావిన్స్ ప్రభుత్వం సహయక చర్యలను వేగవంతం చేసింది. ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లు, పరిపాలనా కార్యాలయాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 
 
ప్రస్తుతం రెస్క్యూ బృందాలు వెల్లడించిన లెక్కల ప్రకారం పది మంది చిన్నారులతో పాటు.. మొత్తం 22 మంది ఈ మంచు తుఫానులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
 
"అపూర్వమైన హిమపాతం, హడావుడి వాతావరణ పిరిస్థితులను తనిఖీ చేయకుండా కొనసాగడం జిల్లా పాలనా యంత్రాంగం సంసిద్ధంగా లేనందున విచారణకు ఆదేశించడం జరిగింది. ఇలాంటి విషాదాల నివారణకు బలమైన నియంత్రణ వ్యవస్థను ఉంచాలని ఆదేశించింది" అని పాక్ ప్రధాని ఓ ట్వీట్‌లో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments