Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్ క్రికెటర్‌కు ధోనీ స్పెషల్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?

పాకిస్థాన్ క్రికెటర్‌కు ధోనీ స్పెషల్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?
, శనివారం, 8 జనవరి 2022 (09:23 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాకిస్థాన్ క్రికెటర్‌కు స్పెషల్ గిప్ఠ్ ఇచ్చాడు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీష్ రవూఫ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని బహుమతిగా ఇచ్చాడు.
 
అందులో ధోనీ సంతకం కూడా ఉంది. ఈ జెర్సీ మరే ఇతర ఆటగాడిది కాదు, స్వయంగా ధోనీదే. జెర్సీ వెనుక ధోనీ నంబర్ ఏడో రాసి, ముందు భాగంలో ధోనీ స్వయంగా సంతకం చేశాడు. హరీష్ రవూఫ్ ఈ జెర్సీని అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇంకా భావోద్వేగ పోస్ట్‌ చేస్తూ కృతజ్ఞతలు తెలిపాడు.
 
ధోనీ జెర్సీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, రౌఫ్ ఇలా వ్రాశాడు - లెజెండరీ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన అందమైన చొక్కాను బహుమతిగా ఇచ్చి నన్ను సత్కరించాడని చెప్పాడు. అలాగే హరీస్ రవూఫ్ పాకిస్థాన్ సూపర్ లీగ్ కోసం సిద్ధమవుతున్నాడు .పీఎస్ఎల్ జనవరి 27 నుండి ప్రారంభమవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండో టెస్ట్‌లో భారత్ ఓటమి.. సౌతాఫ్రికాను గెలిపించిన ఎల్గార్