Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ ముఖ్యమంత్రి ఇంట్లో కరోనా కలకలం - 15 మందికి పాజిటివ్

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (11:21 IST)
జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ నివాసంలో కరోనా కలకలం చెలరేగింది. ఆయన భార్యాపిలలతో పాటు.. ఏకంగా 15 మందికి ఈ వైరస్ సోకింది. ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్ వేవ్ దెబ్బకు భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కరోనా వైరస్ వ్యాపిస్తుంది. 
 
ఈ పరిస్థితుల్లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో హేమంత్ సోరేన్‌ సతీమణిపాటు 15 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే, సీఎం హేమంత్‌కు మాత్రం నెగెటివ్ ఫలితం వచ్చిందని అధికారులు వెల్లడించారు. 
 
ముఖ్యమంత్రి నివాసంలో ఇప్పటివరకు 62 మందికి కోవిడ్ పరీక్షలు చేసినట్టు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు. వీరిలో 24 మందికి ఫలితాలు రాగా, అందులో 15 మందికి పాజిటివ్ ఫలితం వచ్చిందని తెలిపారు. 
 
ఇందులో సీఎం హేమంత్ భార్య కల్పనా సొరేన్, వారి ఇద్దరు కుమారులు నితిన్, విశ్వజిత్, కోడలు సరళా ముర్ములు ఉన్నారని తెలిపారు. ఈ నివాసంలో ఉన్నవారందరికీ తేలికపాటి కోవిడ్ లక్షణాలు ఉండటంతో సెల్ఫ్ హోం క్వారంటైన్‌లో ఉంచినట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

Srivishnu: అల్లు అరవింద్ ప్రజెంట్స్ లో శ్రీ విష్ణు హీరోగా #సింగిల్ చిత్రం

ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments