జోర్డాన్‌లో టాక్సిగ్ యాసిడ్ లీక్ - 12 మంది మృతి

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (15:16 IST)
జోర్డాన్ దేశంలోని అఖ్వాబా నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఓ కంటైనర్‌ కిందపడటంతో ఈ పేలుడు జరిగింది. ఇందులో నుంచి టాక్సిక్ యాసిడ్ లీక్ కావడంతో కావడంతో దాన్ని పీల్చి 12 మంది చనిపోగా, 250 మంది వరకు గాయపడినట్టు సమాచారం. ఈ ప్రమాదం సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జరుగగా, మంగళవారం వెలుగులోకి వచ్చింది. 
 
అఖ్వబా పోర్టులో ట్యాంకులను నౌకల్లో లోడింగ్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఒక కంటైనర్ షిప్ కిందపడిపోయింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఆ తర్వాత ముదురు పసుపు రంగులో దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. 
 
ఇది క్లోరిన్ వాయువుగా గుర్తించారు. దీన్ని పీల్చడం వల్ల 12 మంది ప్రాణాలు విడిచారు. మరో 250 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
రసాయనాన్ని నిల్వవుంచే కంటెయినర్‌ని తరలిస్తున్న సమయంలోనే క్రెయిన్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జోర్డాన్ ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రకటన చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments