Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - బంగ్లాదేశ్ బంధం రక్త సంబంధం : బంగ్లాదేశ్

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (17:05 IST)
ఇటీవలి కాలంలో భారత్‌కు మిత్రదేశాలుగా ఉన్న బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు కాస్త కాలర్ ఎగరేస్తున్నాయి. ముఖ్యంగా, కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణమాలు చూస్తే పలు దేశాలు దేశాలు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. 
 
ఎప్పటినుంచో చైనా, పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కుతుండగా... ఈ మధ్య చైనా అండ చూసుకుని నేపాల్ కూడా రెచ్చిపోతోంది. కానీ బంగ్లాదేశ్ మాత్రం అన్నివేళలా భారక్‌కు నమ్మదగిన మిత్రదేశంగా ఉంది. ఇప్పుడు కూడా ఆ మాటే చెబుతోంది.
 
ఇదే అంశంపై ఆ దేశ విదేశాంగమంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ స్పందిస్తూ, "భారత్‌తో మా సంబంధాలు చారిత్రాత్మకమైనవి... రాక్ సాలిడ్!" అని స్పష్టం చేశారు. "అనేక వాణిజ్యపరమైన అంశాలు చైనాతో ముడిపడి ఉన్నా, మనది రక్త సంబంధం" అని వ్యాఖ్యానించారు.
 
"మేం విజయం సాధిస్తే భారత్ విజయం సాధించినట్టే. మా అభివృద్దే భారత్ అభివృద్ధి. మా సంబంధాలను మరేదీ ఆటంకపర్చలేదు" అని అన్నారు. కేరళలో జరిగిన విమానప్రమాదంపై సంతాపం వ్యక్తం చేసేందుకు అబ్దుల్ మోమెన్ భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్‌తో తమ అనుబంధంపై భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments