Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ అనుమతితోనే స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్ కేర్ సెంటర్ : రమేష్ ఆస్పత్రి

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (15:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఉన్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో రమేష్ ఆస్పత్రి ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటరులో ఆదివారం వేకువజామున జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృత్యువాతపడగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ఈ అగ్ని ప్రమాదానికి రమేష్ ఆస్పత్రి యాజమాన్యమే కారణమంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, ఆ ఆసుపత్రే స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌ను లీజుకు తీసుకుని కొవిడ్‌-19 కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 
 
దీనిపై రమేష్ ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. హోటల్‌ నిర్వహణతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే అక్కడ కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నామని చెప్పింది. ఎక్కువ మంది కొవిడ్‌-19 బాధితులకు వైద్యం అందించాలన్న ఉద్దేశంతో స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ను కరోనా చికిత్సా కేంద్రంగా మార్చామని పేర్కొంది. 
 
హోటల్ నిర్వహణతో సంబంధం లేకుండా తాము రోగులకు వైద్య సేవలు అందించామని వివరించింది. రోగులను చేర్చుకోవాలని భారీగా వినతులు వస్తుండటంతో అన్ని సౌకర్యాలున్న హోటల్లో సర్కారు అనుమతితో రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపింది. ఇక్కడ చికిత్స తీసుకున్న కరోనా బాధితులు చక్కగా కోలుకుంటున్నారని వివరించింది. అయితే, దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం సంభవించిందని, దీనిపట్ల తాము కూడా చింతిస్తున్నట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేస్తే సారీ చెప్పాలి.. తప్పు చేయకుంటే క్షమాపణ చెప్పను : కమల్ హాసన్

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments