Webdunia - Bharat's app for daily news and videos

Install App

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

ఠాగూర్
శుక్రవారం, 25 జులై 2025 (22:47 IST)
గగనతలంలో 35 వేల అడుగుల ఎత్తులో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మస్కట్ నుంచి ముంబైకు వెళుతున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో గురువారం ఉదయం ఒక థాయ్‌లాండ్‌ మహిళా ప్రయాణికురాలు బాలుడికి జన్మనిచ్చింది. విమాన సబ్బంది, విమానంలో ఉన్న ఒక నర్సు సహాయంతో ఈ ప్రసవం విజయవంతంగా జరిగింది. 
 
ఎయిర్‌లైన్ సంస్థ వెల్లడించిన వివరాల మేరకు.. 29 యేళ్ల థాయ్‌లాండ్ జాతీయురాలు ప్రసవ వేదనలోకి వెళ్లిన వెంటనే క్యాబిన్ క్రూ సిబ్బంది వేగంగా స్పందించారు. తల్లి, బిడ్డ గోప్యతను కాపాడటానికి ప్రయాణికులు సీట్లు మార్చారు. అలాగే ఫోన్‌లను పక్కన పెట్టమని సూచించారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 3.15 గంటలకు 35 వేల అడుగుల ఎత్తులో ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. 
 
విమాన పైలెట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించి విషయాన్ని వివరించారు. విమానం ఉదయం 4.02 గంటలకు ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే తల్లి, బిడ్డను సమీప ఆస్పత్రికి తరలించారు. ఆమెకు సహాయం అందించడానికి ఓ మహిళా ఎయిర్‌ లైన్ సిబ్బంది కూడా ఆస్పత్రికి వెళ్లారు అని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments