Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

Advertiesment
air india

ఠాగూర్

, ఆదివారం, 15 జూన్ 2025 (17:57 IST)
ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి దేశ ప్రజలు ఇంకా తేరుకోలేనే లేదు. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో ఏకంగా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. ఇదిలావుంటే మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానం ఏకంగా కొన్ని గంటల పాటు పాటు రన్‌వేపై ఉండాల్సివచ్చింది. ఈ ఘటనపై సదరు సంస్థ స్పందించింది. 
 
వివరాలను పరిశీలిస్తే, ఎయిరిండియా విమానం ఎక్స్ 1,511 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ విమానాశ్రయం నుంచి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాకు బయలుదేరాల్సివుంది. టేకాఫ్ అయిన కాసేపటికే ముందు విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దీన్ని వెంటనే గుర్తించిన సంస్థ అప్రమత్తమైంది. దీంతో విమాన ప్రయాణాన్ని నిలిపివేసింది. కొన్ని గంటలు ఆలస్యంగా బయలుదేరనుందని తెలిపింది. 
 
అలాగే, ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ, టేకాఫ్‌కి కాసేపు ముందే సాంకేతిక లోపాన్ని గుర్తించాం. ఆలస్యం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. వారికి రీషెడ్యూల్ లేదా రీఫండ్ చేసేందుకు సంస్థ సిద్ధంగా ఉంది అని ఓ ప్రటనలో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!