కోల్కతాకు చెందిన వజాహత్ ఖాన్ ఫిర్యాదు మేరకు పూణేకు చెందిన 22 ఏళ్ల లా విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలిని అరెస్టు చేశారు. అయితే శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. వజాహత్ ఖాన్ మిస్ అయినట్లు సమాచారం. శుక్రవారం కోల్కతా పోలీసులు శర్మిష్ట పనోలిని అదుపులోకి తీసుకున్నప్పటికీ, వజాహత్ ఖాన్ ఇప్పుడు రాజకీయ, చట్టపరమైన గందరగోళానికి కేంద్రబిందువుగా ఉన్నాడు.
శర్మిష్ట అరెస్టుకు కారణమైన వజాహత్ ఖాన్పై మూడు భారతీయ రాష్ట్రాల్లో అతనిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అస్సాం అతన్ని పట్టుకోవడానికి పోలీసు బృందాన్ని పంపడానికి సిద్ధమవుతోంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, ఢిల్లీలో వజాహత్ ఖాన్పై ఎఫ్ఐఆర్లు దాఖలు చేశాయి. ఇంకా దర్యాప్తు ప్రారంభించాయి. అతని తండ్రి సాదత్ ఖాన్ ప్రకారం, బెదిరింపులు, ఫోన్ కాల్స్ కారణంగా అతను అజ్ఞాతంలోకి వెళ్లాడని ఆరోపించారు. అస్సాంలోని డిస్పూర్ నుండి ఒక పోలీసు బృందం వజాహత్ ఖాన్ను అరెస్ట్ చేసేందుకు పశ్చిమ బెంగాల్కు వెళ్లనుంది.
శర్మిష్ట పనోలిపై మొదట ఫిర్యాదు చేసిన కోల్కతాకు చెందిన రషీది ఫౌండేషన్ సంస్థకు వజాహత్ ఖాన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, శ్రీ రామ్ స్వాభిమాన్ పరిషత్ అనే ఛారిటబుల్ ట్రస్ట్ మంగళవారం ఖాన్పై గార్డెన్ రీచ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.