Webdunia - Bharat's app for daily news and videos

Install App

131కి చేరిన కరోనా మృతుల సంఖ్య.. భారత వైద్య విద్యార్థికి కరోనా సోకిందా?

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (11:16 IST)
చైనాలో కరోనా వైరస్‌ ప్రాణాంతకంగా మారింది. ఇప్పటివరకు ఈ వైరస్‌ కారణంగా మరో 24 మంది మరణించడంతో మృతుల సంఖ్య 131కి చేరిందని, 4,515 న్యుమోనియా కేసులు నమోదయ్యాయని చైనా ప్రకటించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో భారత్‌కు వచ్చే ప్రయాణికులను తనిఖీ చేసేందుకు 20 విమానాశ్రయాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ సదుపాయాన్నిఏర్పాటు చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు.
 
భారత్‌లో ఒక్కవ్యక్తికి కూడా కరోనా వైరస్‌ సోకలేదని ఆయన తెలిపారు. చైనాలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని వూహాన్‌కి పంపనున్నట్టు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. చైనా దేశంలోని వూహాన్ నగరంలోని వైద్యకళాశాలలో చదువుతున్న మ‌ధ్యప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థికి కరోనా వైరస్ లక్షణాలు సోకాయని అనుమానిస్తున్నారు. ఆ విద్యార్థి తన స్వస్థలమైన ఉజ్జయిని నగరానికి ఈ నెల 13వ తేదీన వచ్చారు. వూహాన్ నగరం నుంచి వైద్య విద్యార్థి రావడంతో అతనికి కూడా ఈ వైరస్ సోకి ఉండొచ్చని అనుమానించారు.
 
దీంతో అతన్ని వెంటనే ఉజ్జయిని ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించామని జిల్లా కలెక్టరు శశాంక్ మిశ్రా చెప్పారు. ఉజ్జయిని వైద్యవిద్యార్థి రక్తనమూనాలను సేకరించి పరీక్ష కోసం పూణేలోని జాతీయ వైరాలజీ లాబోరేటరీకి పంపించామని కలెక్టరు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments