Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్ట్ ట్రై చేసిన పాకిస్తాన్... పేల్చేసిన భారత్

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (16:09 IST)
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకార దాడులు జరిగిన కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ మరో దుస్సాహసానికి ప్రయత్నించింది. కెమెరా అమర్చిన పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఒక డ్రోన్ భారత భూభాగంలోకి ప్రవేశించింది. అప్రమత్తమైన భారత ఆర్మీ దాన్ని క్షణాల్లో పేల్చేసింది.
 
మంగళవారం వేకువజామున 3.30 గంటలకు వైమానిక దాడులు జరగగా సరిగ్గా ఉదయం 6.30 గంటల ప్రాంతంలో గుజరాత్‌లోని కచ్ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న నలియా ఎయిర్‌బేస్‌కు సమీపంలో తిరుగాడుతున్న డ్రోన్‌ను భారత్ గుర్తించింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే దాన్ని పేల్చివేసారు. ఈ ఎయిర్‌బేస్ సరిహద్దుకు అతి సమీపంలో ఉండటంతో ఇక్కడి నుండి భారత్ దాడులకు దిగుతుందేమో అనే వివరాలను తెలుసుకోవడానికి దీన్ని పంపి ఉండవచ్చని విశ్లేషించారు.
 
వైమానిక దాడుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్‌లలో హైఅలర్ట్ ప్రకటించగా, గుజరాత్‌లో కూడా అప్రమత్తంగా ఉండాలని త్రివిధ దళాలకు ఆజ్ఞలు జారీ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments