Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మరక్షణ హక్కు మాకూ ఉంది కదా... పాక్

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (15:43 IST)
పుల్వామా ఉగ్రదాడి ద్వారా 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పాకిస్థాన్‌కు భారత్ ధీటుగా బదులిచ్చింది. జైషే ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసింది. 12 మిరాజ్‌-2000 జెట్‌ ఫైటర్స్‌తో చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్‌-2 విజయవంతంగా పూర్తి చేసి. దాదాపు 200 నుండి 300 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్‌ చర్యపై అనుసరించాల్సిన విధానంపై చర్చిం‍చేందుకు పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. మంత్రులు, ఆర్మీ అధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు.
 
కాగా, భారత్‌ జరిపిన ఈ మెరుపు దాడులపై పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ స్పందిస్తూ, భారత వైమానిక దళాలు దాడి చేసిన విషయాన్ని ధ్రువీకరించారు. "భారత్‌ ఇలాంటి పని చేస్తుందని మేము ప్రపంచానికి చెప్తూనే ఉన్నాము. మా మాటలను భారత్‌ ఈరోజు నిజం చేసి చూపించింది. ఇప్పుడు మేము వాళ్లకు సరైన సమాధానం చెప్పే హక్కు పొందాము. వాస్తవాధీన రేఖను దాటి భారత్‌ నిబంధనలను ఉల్లంఘించింది. ఆత్మరక్షణ హక్కు మాకు కూడా ఉంది కదా" అని ఖురేషీ వ్యాఖ్యానించారు.
 
కాగా భారత్ వైపు నుంచి జరిగినదే ప్రతీకార చర్య అన్నప్పుడు మళ్లీ ఆత్మరక్షణ చర్చ ఎందుకు వస్తుందో మరి ఖురేషీగారికే తెలియాలి. అయితే... ప్రతీకార దాడులు చేసిన నేపథ్యంలో, అధికార యంత్రాంగం ఇప్పటికే దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి అప్రమత్తం చేయడం తెలిసిన విషయమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments