Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ దూకుడు.. సాయం చేయండి ప్లీజ్.. చైనాను కోరిన పాక్

Advertiesment
భారత్ దూకుడు.. సాయం చేయండి ప్లీజ్.. చైనాను కోరిన పాక్
, మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (15:07 IST)
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌తో బెంబేలెత్తిపోయిన పాకిస్థాన్ తగిన సహాయం అందించవలసిందని వెంటనే చైనాను సంప్రదించింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ రంగ అధికార వార్తా సంస్థ జిన్హుహా వెల్లడించింది. 
 
జిన్హువా వెల్లడించిన కథనం మేరకు... వాయుసేన విమానాలు దాడి చేసి వెనక్కు వెళ్లిపోయిన వెంటనే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మఖ్దూమ్ షా మహమ్మద్ ఖురేషీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వీకి ఫోన్ చేసి మాట్లాడుతూ భారత సైన్యం నిబంధనలకు విరుద్ధంగా వాస్తవాధీన రేఖను దాటి ముజఫరాబాద్ సెక్టార్‌లోకి ప్రవేశించిందని ఫిర్యాదు చేసి తిరిగి దాడులు చేసేందుకు సహకరించవలసిందిగా చైనాని కోరగా, అందుకు చైనా అంగీకరించలేదని పేర్కొంది. 
 
భారత యుద్ధ విమానాలను పసిగట్టిన పాక్ ఎయిర్ ఫోర్స్ కౌంటర్ ఫైటర్ దళాలు, వాటిని తరిమేసాయని మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మరి తరిమేసాక ఈ దాడులకు సంబంధించిన ఫిర్యాదులేమిటో వాళ్లకే తెలియాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైమానిక దళానికి సెల్యూట్ : రాహుల్ గాంధీ