రష్యాలో కరోనా విలయతాండవం... 24 గంటల్లో వెయ్యి మంది మృతి

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (09:31 IST)
రష్యాలో కరోనా వైరస్ మళ్లీ విలయతాండవం చేస్తుంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1002 మంది మృత్యువాతపడ్డారు. నిజానికి ఈ వైరస్ వెలుగు చూసిన తొలినాళ్ళలో అపారనష్టాన్ని ఎదుర్కొన్న దేశాల్లో రష్యా కూడా ఒకటి. ఆ తర్వాత కాస్త శాంతించింది. ఈ క్రమంలో ఇపుడు కొత్త కేసులు, మరణాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. 
 
తొలిసారి 24 గంటల వ్యవధిలోనే వెయ్యికి పైగా (1,002) మరణాలు నమోదయ్యాయి. 33,208 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలుపుకుని దేశ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 79.50 లక్షలకు చేరుకోగా, 2.22 లక్షల మంది కరోనాకు బలయ్యారు. 
 
ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు, కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా ఐదో స్థానంలో నిలిచింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతుండడం, కరోనా నిబంధనల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడమే కరోనా తాజా విజృంభణకు కారణంగా తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments