Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - చైనాల మధ్య ఘర్షణ - తోకముడిచిన డ్రాగన్ సైన్యం

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (12:31 IST)
డ్రాగన్ దేశం తన వంకర బుద్ధిని మార్చుకోలేదు. తూర్పు ల‌డఖ్‌లో మ‌ళ్లీ సైనికుల‌ను త‌ర‌లిస్తూ చైనా మ‌రోసారి దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంది. దీంతో చైనా సైనికుల‌ను ఎదుర్కొనేందుకు భార‌త సైన్యం కూడా ధీటుగా స్పందించింది. దీంతో చైనా సైనికులు తోకముడిచి అక్కడ నుంచి వెనక్కి వెళ్లిపోయారు. 
 
మ‌రోవైపు, అరుణాచ‌ల్ సెక్టార్‌లోనూ చైనా రెచ్చ‌గొట్టే చర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ఆ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మ‌ధ్య కొన్ని గంట‌ల పాటు ఘ‌ర్ష‌ణ వాతావరణం చోటుచేసుకుంది. కొన్ని గంట‌ల పాటు ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.
 
అరుణాచ‌ల్ సెక్టార్‌లో తాజాగా చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న గురించి మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది. శాంతి మంత్రం జ‌పిస్తూనే ఇప్పుడు తూర్పు ల‌డ‌ఖ్‌తో పాటు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సెక్టార్ వ‌ద్ద కూడా చైనా ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.
 
భారత బలగాలు సరిహద్దుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఒక్కసారిగా 200 మంది చైనా సైనికులు వాస్తవాధీన రేఖకు అత్యంత సమీపానికి రావడాన్ని గుర్తించారు. వీరు ఎల్ఐసీని దాటేందుకు ప్రయత్నించగా భారత్ సైన్యం అడ్డుకుంది. ఈ క్రమంలో ఇరు దేశాల సైనిక బలగాల మధ్య కొన్ని గంటల పాటు ఘర్షణ చోటుచేసుకుంది. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో ఇరు దేశాలు వాస్తవాధీన రేక నుంచి వెనక్కి వెళ్లిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments