Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై అణు బాంబులతో దాడికి సిద్ధమవుతున్న పాకిస్థాన్?

భారత్‌పై అణు బాంబులతో దాడి చేసేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. వివిధ అంశాలపై అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను భారత్ ఏకాకి చేస్తోంది. ముఖ్యంగా, ఉగ్రవాదంపై పాక్ వైఖరిని ప్రపంచ వేదికలపై భారత్ ఎండ

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (10:51 IST)
భారత్‌పై అణు బాంబులతో దాడి చేసేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. వివిధ అంశాలపై అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను భారత్ ఏకాకి  చేస్తోంది. ముఖ్యంగా, ఉగ్రవాదంపై పాక్ వైఖరిని ప్రపంచ వేదికలపై భారత్ ఎండగడుతోంది. పైగా, భారత్ తెచ్చిన ఒత్తిడి కారణంగా పాక్ ఇచ్చే నిధులను కూడా అమెరికా నిలిపివేసింది. దీంతో భారత్‌పై కక్షగట్టిన పాకిస్థాన్... అణ్వాయుధాలను ఎక్కుపెడుతోందని రిపోర్టులు వస్తున్నాయి. 
 
ప్రస్తుతం పాకిస్థాన్ చేతిలో దాదాపు 140 అణు ఆయుధాలు ఉండవచ్చని ఓ అంచనా. వీటన్నింటినీ ఓ రహస్య ప్రదేశంలో దాచేందుకు పాక్ యత్నిస్తోంది. దీనికోసం సొరంగాన్ని నిర్మిస్తోందని ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్ పేర్కొంది. పాక్‌లోని మియన్ వాలీ పట్టణం సమీపంలో ఈ సొరంగాన్ని నిర్మిస్తోందని తెలిపింది. 
 
ఈ సొరంగాలు ఉన్న ప్రదేశానికి మిస్సైల్ లాంచర్లను తీసుకెళ్లేందుకు వీలుగా భారీ రోడ్లను కూడా నిర్మిస్తోందట. మియన్ వాలీ పట్టణం భారత్‌కు సమీపంలో ఉంటుంది. అమృతసర్‌కు 350 కిలోమీటర్లు, ఢిల్లీకి 750 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తక్కువ దూరంలోనే అణ్వాయుధాలను అందుబాటులో ఉంచుకోవడం ద్వారా... భారత్‌పై దాడికి సన్నద్ధంగా ఉండాలనేదే పాకిస్థాన్ ఆలోచనగా ఉంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments