Webdunia - Bharat's app for daily news and videos

Install App

జై షా ఆస్తులపై విచారణ జరిపించాలి : ఏచూరి డిమాండ్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జై షా కంపెనీ పెరుగుదల, ఆయన ఆస్తులపై విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ డిమాండ్ చేశారు.

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (10:37 IST)
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జై షా కంపెనీ పెరుగుదల, ఆయన ఆస్తులపై విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ డిమాండ్ చేశారు. గత మూడేళ్ళ కాలంలో అమిత్ షా కుమారుడి కంపెనీ పెరుగుదల ఏకంగా 16 వేల రెట్లు ఉన్నట్టు ఓ వెబ్ పోర్టల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. 
 
దీనిపై సీతారాం ఏచూరి స్పందిస్తూ...  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన కుంభకోణాలపై ఇప్పటివరకు కేంద్రం ఎలాంటి విచారణ జరపలేదన్నారు. మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం, బీహార్‌లో ల్యాండ్‌ స్కాం, లలిత్‌ మోడీ ఇష్యూ, బిర్లా సహారా డైరీపై ఎలాంటి విచారణ జరపలేదని ఆయన గుర్తు చేశారు. 
 
పనామా పేపర్ల కుంభకోణంలో పాకిస్థాన్‌ ప్రధాని తన పదవినే కోల్పోయారని, ఈ స్కామ్‌లో కూడా ప్రధాని మోడీ పేరు ఉందని ఆయన ఆరోపించారు. తాజాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడు జై షా ఆస్తులు ఈ మూడేళ్లలో 16 వేల రెట్లు పెరిగాయని.. దీనిపైన విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం కుంభకోణాలపై విచారణ జరపకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని ఏచూరి హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments