Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యేడాదిలో కొడుకు కంపెనీ 16 వేల రెట్లు వృద్ధి... చిక్కుల్లో అమిత్ షా

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అమిత్ షా చిక్కుల్లో పడ్డారు. ఈయన కుమారుడు జయ్ అమిత్ షా సారథ్యంలోని కంపెనీ గత యేడాది కాలంలో ఏకంగా 16 వేల రెట్లు వృద్ధి సాధించింది.

Advertiesment
Amit Shah
, బుధవారం, 11 అక్టోబరు 2017 (10:32 IST)
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అమిత్ షా చిక్కుల్లో పడ్డారు. ఈయన కుమారుడు జయ్ అమిత్ షా సారథ్యంలోని కంపెనీ గత యేడాది కాలంలో ఏకంగా 16 వేల రెట్లు వృద్ధి సాధించింది. అంటే, పెద్ద నోట్లకు ముందు ఈ కంపెనీని మూసివేయడం జరిగింది. ఆ తర్వాత కంపెనీని తిరిగి ప్రారంభించారు. అటు పిమ్మటే ఈ కంపెనీ ఏకంగా 16 వేల రెట్లు వృద్ధిని సాధించినట్టు జయ్ షా ఆదాయపన్ను శాఖకు సమర్పించిన టాక్స్ రిటర్న్స్‌లో పేర్కొన్నారు. 
 
అంటే.. నష్టాల్లో ఉన్న కంపెనీ ఆ తర్వాత రూ.80 కోట్ల మేరకు ఆదాయాన్ని అర్జించింది. దీనికి కారణం అమిత్ షా అని వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీలోనే కాదు.. ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషిస్తున్న అమిత్‌షా తన కుమారుడు జయ్‌ షాకు మేలు చేకుర్చేలా వ్యవహరించారన్న ప్రచారం సాగుతోంది. 
 
జయ్‌షా వ్యాపారం ఓ యేడాది వ్యవధిలోనే 16 వేల రెట్లు పెరిగిందని "ది వైర్‌ న్యూస్‌" పోర్టల్‌ కీలక కథనాన్ని ప్రచురించింది. అంతేకాకుండా, జయ్‌షా తన తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకొని కోట్లాది రూపాయల బ్యాంక్‌ రుణాన్ని అక్రమ మార్గాల్లో పొందారని ఈ కథనంలో పేర్కొనడం జరిగింది. ఈ వార్త రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. జయ్‌ షా వ్యాపారాభివృద్ధి విధానమేంటో ప్రభుత్వం స్పష్టం చేయాలని విపక్షాలు ప్రధాని మోడీని డిమాండ్‌ చేశాయి. ఈ వ్యవహారం అమిత్ షా మెడకు చుట్టుకునేలా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పయ్యావులా? కేసీఆర్‌తో నీకెందుకంత సాన్నిహిత్యం?: చంద్రబాబు క్లాస్