Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయ్యా మీకు దండం... మోటారు బైకుపై ఐదుగురా...

చాలాచోట్ల రోడ్డు ప్రమాదాలకు కారణం అతి వేగంతో పాటు మితిమీరిన ప్రయాణికులతో వాహనాన్ని నడపడం. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల విషయంలో అయితే ఇక వేరే చెప్పక్కర్లేదు. మోటారు బైకుపై ఎంతమంది వీలుంటే అంతమందిని కూర్చోబెట్టుకుని కొందరు మొండి ప్రయాణం చేస్తుంటారు. ఇలా

అయ్యా మీకు దండం... మోటారు బైకుపై ఐదుగురా...
, సోమవారం, 9 అక్టోబరు 2017 (20:51 IST)
చాలాచోట్ల రోడ్డు ప్రమాదాలకు కారణం అతి వేగంతో పాటు మితిమీరిన ప్రయాణికులతో వాహనాన్ని నడపడం. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల విషయంలో అయితే ఇక వేరే చెప్పక్కర్లేదు. మోటారు బైకుపై ఎంతమంది వీలుంటే అంతమందిని కూర్చోబెట్టుకుని కొందరు మొండి ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి కారణంగా ప్రమాదాలు చోటుచేసుకోవడం జరుగుతుంటుంది. వీటిని ఆపేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎన్ని అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తున్నా దున్నపోతు మీద వాన కురిసినట్లే అవుతుంది. 
 
ద్విచక్ర వాహనంపై ఇద్దరికి మించి ప్రయాణించవద్దు బాబోయ్ అని పోలీసులు మొత్తుకుంటున్నా వింటున్నవారు బహు కొద్దిమందే. ఇక హెల్మెట్ విషయం వేరే చెప్పక్కర్లేదు. పోలీసులను అంత దూరంలో చూసి హెల్మెట్ తీసుకుని తగిలించుకుంటారు. అదే పోలీసులు ఎవరూ లేరని నిర్థారణ అయితే హెల్మెట్ తీసి మోటారు సైకిల్ ఇంజిన్ బాక్సుపై పెట్టేసి నడిపేస్తుంటారు. 
 
ఇలాంటివారిని ఏం చేయాలో ఆ సబ్ ఇన్ స్పెక్టరుకు అర్థంకాక ఇలా ఏకంగా దండమే పెట్టేశారు. ఐదుగురితో ద్విచక్ర వాహనంపై అనంతపురంలో వెళుతున్న ఓ వాహన చోదకుడిని ఆపి మరీ  శుభ‌కుమార్ అనే ఇన్స్‌పెక్ట‌ర్ వారికి దండం పెట్టేసి, ఇలా ప్ర‌యాణిస్తే ఎలా అయ్యా ప్రశ్నించాడు. ఆ ఫోటో ఇప్పుడు ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది. ఈ ఫోటో చూసైనా అలాంటి ద్విచక్ర వాహనదారుల్లో చైతన్యం వస్తుందేమో?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలో సుందర నగరంగా నంద్యాల... భూమా బ్రహ్మానందరెడ్డి