Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల్‌భూషణ్ జాదవ్‌‌ కేసులో పాకిస్థాన్ అలా చేస్తోంది..

Webdunia
గురువారం, 23 జులై 2020 (22:35 IST)
భారత నావికా దళం మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ శిక్షను పునఃసమీక్షించాలని పాకిస్థాన్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశించింది. ఈ నేపథ్యంలో మిలిటరీ కోర్టు తీర్పుపై అపీలు చేయవలసి ఉంది. అయితే ఈ కేసులో చట్టపరమైన అన్ని అవకాశాలను పాకిస్థాన్ అడ్డుకుంటోందని భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, జూలై 16న భారత దేశ కాన్సులర్ ఆఫీసర్లు జాదవ్‌ను కలిసినపుడు పాకిస్థాన్ అధికారులు అడ్డంకులు సృష్టించారన్నారు. ఈ కేసు పట్ల పాకిస్థాన్ వ్యవహార శైలి ఓ ప్రహసనంగా ఉందని పేర్కొన్నారు. జాదవ్ నుంచి పవరాఫ్ అటార్నీ తీసుకోవడానికి సైతం భారత దేశానికి అవకాశం ఇవ్వలేదన్నారు.
 
జాదవ్ నుంచి పవరాఫ్ అటార్నీని తీసుకోలేకపోవడం వల్ల మరణ శిక్షపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం సాధ్యం కాదని ఈ కేసులో భారత్ తరపున వాదిస్తున్న పాకిస్థానీ లాయర్ చెప్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తదుపరి అనుసరించదగిన అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్లు రెంటర్ సిస్టమ్ వద్దు- పర్సెంటేజ్ ముద్దు : కె.ఎస్. రామారావు

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments