Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల్‌భూషణ్ జాదవ్‌‌ కేసులో పాకిస్థాన్ అలా చేస్తోంది..

Webdunia
గురువారం, 23 జులై 2020 (22:35 IST)
భారత నావికా దళం మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ శిక్షను పునఃసమీక్షించాలని పాకిస్థాన్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశించింది. ఈ నేపథ్యంలో మిలిటరీ కోర్టు తీర్పుపై అపీలు చేయవలసి ఉంది. అయితే ఈ కేసులో చట్టపరమైన అన్ని అవకాశాలను పాకిస్థాన్ అడ్డుకుంటోందని భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, జూలై 16న భారత దేశ కాన్సులర్ ఆఫీసర్లు జాదవ్‌ను కలిసినపుడు పాకిస్థాన్ అధికారులు అడ్డంకులు సృష్టించారన్నారు. ఈ కేసు పట్ల పాకిస్థాన్ వ్యవహార శైలి ఓ ప్రహసనంగా ఉందని పేర్కొన్నారు. జాదవ్ నుంచి పవరాఫ్ అటార్నీ తీసుకోవడానికి సైతం భారత దేశానికి అవకాశం ఇవ్వలేదన్నారు.
 
జాదవ్ నుంచి పవరాఫ్ అటార్నీని తీసుకోలేకపోవడం వల్ల మరణ శిక్షపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం సాధ్యం కాదని ఈ కేసులో భారత్ తరపున వాదిస్తున్న పాకిస్థానీ లాయర్ చెప్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తదుపరి అనుసరించదగిన అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments