Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌‍లో ఆల్‌టైమ్ గరిష్టానికి పెట్రోల్ - గ్యాస్ ధరలు

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (12:36 IST)
పాకిస్థాన్ దేశంలో ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. పెట్రోల్, గ్యాస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. పీకల్లోతు ఆర్థిక సంక్షోభంతో పాటు నానాటికీ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. తాజాగా ఇంధన ధరలను మళ్లీ పెంచడంతో లీటర్ పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ.272కు చేరింది. 
 
పాకిస్థాన్ దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు రోజురోజుకూ అడుగంటి పోతున్నాయి. దీంతో విదేశీ నిధుల కోసం పాకిస్థాన్ చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ క్రమంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. అయితే, నిధుల విడుదలకు ఐఎంఎఫ్ విధించిన నిబంధనల మేరకు పాక్ ఈమారు పెట్రోల్ ధర ఏకంగా రూ.22.20కి మేరకు పెంచింది. 
 
పెట్రోల్‌తో పాటు డీజిల్ ధరలు కూడా పెంచడంతో లీటర్ రూ.280కు చేరుకుంది. లీటర్‌కి కిరోసిన్ ధర రూ.202.70కి చేరుకుంది. కొత్త ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. పాకిస్థాన్‌ను నిధుల విడుదల కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఆర్థిక క్రమశిక్షణ పేరిట పాక్ ప్రభుత్వానికి పలు నిబంధనలు విధించింది. ఇందులో భాగంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవల మినీ బడ్జెట్‌లో పన్నులను పెంచింది. ఈ యేడాది ప్రథమార్థంలో పాక్ ద్రవ్యోల్బణంగా గరిష్టంగా 33 శాతానికి చేరుకుని ఆపై గ్గడం ప్రారంభిస్తుందని అంచనా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి.. భారతరత్నతో సత్కరించాలి

బాలీవుడ్‌కు బైబై చెప్పనున్న కీర్తి సురేష్... ఆ కొత్త ఛాన్స్ కలిసొస్తుందా?

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. నిందితుడు బిజోయ్ దాస్ విషయాలు.. ఎక్కడ నుంచి వచ్చాడంటే?

Bulli Raju: సంక్రాంతికి వస్తున్నాం.. బుల్లిరాజుకు పవన్ కల్యాణ్ ఇష్టమట...

సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి బంగ్లాదేశ్ జాతీయుడే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments