Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ సంచలనం: అత్యాచార నిందితులకు అది కట్..?

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (15:27 IST)
పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో రెండు కొత్త ఆర్డినెన్స్‌లను అమలులోకి తెచ్చింది. ఫలితంగా దేశంలో అత్యాచార కేసులు, లైంగిక వేధింపుల కేసులను గణనీయంగా తగ్గించాలని భావిస్తోంది. కెమికల్‌ కాస్ట్రేషన్‌ ద్వారా రేపిస్టులకు పుంసత్వాన్ని దెబ్బతీయాలని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. రేప్ కేసులకు సంబంధించి విచారణ కొరకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడానికి పాక్ ప్రభుత్వం సిద్ధమైంది.
 
ఈ కొత్త ఆర్డినెన్స్‌లకు కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం అధ్యక్షుడు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అన్ని వయస్సుల స్త్రీలను మహిళలుగా ఈ కొత్త చట్టంలో భావిస్తారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో అమలవుతున్న నిబంధనల ప్రకారం 15 సంవత్సరాలలోపు బాలికలపై అత్యాచారం చేస్తే మాత్రమే రేప్ కేసుగా నమోదు చేసుకుంటున్నారు. పుంసత్వాన్ని దెబ్బతీయడం దోషులు చేసిన రేప్ కేసుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
 
పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశంలో యాంటీ రేప్‌ సెల్స్‌ ను కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. గతంలో పాకిస్తాన్‌లో టూ ఫింగర్‌ టెస్ట్ ద్వారా కన్యత్వాన్ని నిర్ధారించేవారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ పరీక్షలపై సైతం పాక్ ప్రభుత్వం నిషేధం విధించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం