Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉ.కొరియాలో అణుప్రమాదం.. 200 మంది మృత్యువాత

ఉత్తర కొరియాలో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 200 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఉత్తర కొరియాలోని పుంగేరీ ప్రాంతంలో ఉన్న అణుప్రయోగ స్థలంలోని ఓ భారీ సొరంగం కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది.

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (06:21 IST)
ఉత్తర కొరియాలో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 200 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఉత్తర కొరియాలోని పుంగేరీ ప్రాంతంలో ఉన్న అణుప్రయోగ స్థలంలోని ఓ భారీ సొరంగం కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ విషయాన్ని జపాన్‌ మీడియా అధికారికంగా వెల్లడించింది. గత నెల 10వ తేదీన మిలిటరీ సైట్‌ వద్ద నిర్మాణ పనులు చేపట్టుతుండగా ఒక్కసారిగా సొరంగం కూలిపోయినట్లు పేర్కొంది. తొలుత సొరంగంలో 100 మంది చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపడుతుండడంతో మిగిలిన భాగం వారిపై కూలిపోయింది.
 
దాంతో మరో 100 మంది మృత్యువాతపడ్డారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఉ.కొరియా అధికారులు స్పందించలేదు. ఇటీవల ఉత్తర కొరియా అతపెద్ద హైడ్రోజన్‌ బాంబ్‌ను పరీక్షించడంతో ఆ ప్రదేశం మొత్తం దెబ్బతింది. దాంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని జపాన్‌ మీడియా వెల్లడించింది. అగ్రరాజ్యం అమెరికాపై కయ్యానికి కాలుదుతున్న ఉ.కొరియాకు ఈ ఘటన గట్టి ఎదురుదెబ్బే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments