Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెలారస్ ఉద్యమ కారుడికి నోబెల్ శాంతి బహుమతి

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (19:29 IST)
ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం పాటుపడే వ్యక్తులు, సంస్థలకు ప్రతి యేటా ఇచ్చే ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని నోబెల్ కమిటీ ప్రకటించింది. ఈ యేడాది బెలారస్ దేశానికి చెందిన మానవ హక్కుల ఉద్యమకారుడు బైలియాట్ స్కీ, రష్యాకు చెందిన మానవ హక్కుల సంస్థ మెమోరియల్, ఉక్రెయిన్‌ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కు ఈ శాంతి బహుమతిని ప్రకటించింది. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ ఉద్యమకారుడు, ఉద్యమ సంస్థలు తమ దేశాల్లో ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు పట్ల అవగాహనం కల్పించడం, ప్రోత్సహించడం, పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం వంటి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తులకు, సంస్థలకు శాంతి బహుమతి ఇస్తామని ఈ సందర్భంగా కమిటీ వివరించింది. 
 
ఈ యేడాది శాంతి బహుమతి విజేతలు యుద్ధ నేరాలు నమోదు చేయడం, మావన హక్కుల ఉల్లంఘనలు, ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడంతో ద్వారా అమోఘమైన కృషి చేశారని నోబెల్ కమిటీ కొనియాడింది. శాంతి ప్రజాస్వామ్యం నెలకొల్పడంతో పౌర సమాజం పాత్ర ప్రాముఖ్యతను వారు చెప్పారని వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments