Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో ఘోర ప్రమాదం: 150మందికి పైగా ప్రయాణీకుల గల్లంతు

Webdunia
గురువారం, 27 మే 2021 (11:33 IST)
Boat
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి కంటే ఎక్కువ మంది పడవలో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 150 మందికి పైగా ప్రయాణీకులు గల్లంతయ్యారు. 
 
వివరాల్లోకి వెళితే.. నైజీరియా దేశంలోని సెంట్రల్ నైజర్ రాష్ట్రం నుంచి వాయువ్య కెబ్బి రాష్ట్రానికి 180 మంది ప్రయాణీకులతో ఓ పడవ బయలుదేరిందని నేషనల్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ స్థానిక మేనేజర్ యూసుఫ్ బిర్మా తెలిపారు. ఆ పడవ సామర్ధ్యానికి మించి అధిక సంఖ్యలో ప్రయాణిస్తుండడంతో పడవ మునిగిపోయింది.
 
ఈ ఘటనలో 22 మందిని రక్షించామని, నలుగురు మరణించారని చెప్పారు. సుమారు 150 మంది గల్లంతయ్యారని గాస్కి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అబ్దుల్లాహి బుహారి వారా తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
 
అయితే.. వారంతా నీటిలో మునిగిపోయినట్లుగా భావిస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే.. నైజీరియా దేశంలోని ఇలాంటి పడవ ప్రమాదాలు భారీగానే జరుగుతున్నాయి. నదిలో ప్రమాదానికి గురైన పడవ పాతదని.. ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించారని బిర్మా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments