Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

ఠాగూర్
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (10:04 IST)
ఇరాన్ దేశంలోని దక్షిణ హార్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లో గల ఓడరేవులో శనివారం భారీ పేలుడు సంభవించగా, ఇందులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 40కి చేరినట్టు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఐబీ వెల్లడించింది. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం సోమవారం జాతీయ సంతాపదినంగా ప్రకటించింది. 
 
హార్మోజ్‌గాన్ గవర్నర్ మహమ్మద్ అషౌరీ తజియాని వెల్లడించిన వివరాల మేరకు.. పేలుడు తర్వాత అగ్నిప్రమాదం సంభవించిందని, దీంతో వెయ్యి మందికిపై గాయపడ్డారని తెలిపారు. వీరిలో 197 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫాతిమో మొహజెరాని సోషల్ మీడియా ద్వారా సంతాప దినం ప్రకటనను ధృవీకరించింది. 
 
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ షెజెష్కియాన్ ఆదివారం ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించినట్టు అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments