వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

ఠాగూర్
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (09:42 IST)
వేసవి సెలవులు కావడంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం త్వరితగతిన కల్పించేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థాన (తితిదే) బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, వీఐపీ సిఫారసు లేఖల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వెసవి సెలవులు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే మే ఒకటో తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు బ్రేక్ దర్శనాలను పరిమితం చేయాలని తితిదే నిర్ణయించింది. 
 
శ్రీవారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనాలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకే పరిమితం చేసిన తితిదే.. వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని కూడా ప్రయోగాత్మకంగా మార్పులు చేసింది. 
 
ఈ మార్పు మేరకు.. బ్రేక్ దర్శనం ఇకపై ఉదయం 6 గంటలకు ప్రారంభించి 10 గంటల లోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ దర్శనాలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతాయి. తాజా నిర్ణయంతో మే ఒకటో తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు ప్రజా ప్రతినిధులు, తితిదే బోర్డు సభ్యుల బ్రేక్ దర్శనాల సిఫారసు లేఖలను అనుమతించరని తితిదే అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments