వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

ఠాగూర్
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (09:42 IST)
వేసవి సెలవులు కావడంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం త్వరితగతిన కల్పించేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థాన (తితిదే) బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, వీఐపీ సిఫారసు లేఖల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వెసవి సెలవులు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే మే ఒకటో తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు బ్రేక్ దర్శనాలను పరిమితం చేయాలని తితిదే నిర్ణయించింది. 
 
శ్రీవారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనాలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకే పరిమితం చేసిన తితిదే.. వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని కూడా ప్రయోగాత్మకంగా మార్పులు చేసింది. 
 
ఈ మార్పు మేరకు.. బ్రేక్ దర్శనం ఇకపై ఉదయం 6 గంటలకు ప్రారంభించి 10 గంటల లోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ దర్శనాలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతాయి. తాజా నిర్ణయంతో మే ఒకటో తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు ప్రజా ప్రతినిధులు, తితిదే బోర్డు సభ్యుల బ్రేక్ దర్శనాల సిఫారసు లేఖలను అనుమతించరని తితిదే అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments