Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా.. ప్రపంచ యుద్ధం కంటే ప్రమాదకరం.. కిషన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (15:22 IST)
ప్రపంచ యుద్దం కంటే ప్రమాదకరంగా భావించి కరోనాపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రస్తుతం కరోనాపై యుద్ధం చేయాల్సిన అవసరం వుందని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 492 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని...ప్రజలంతా తప్పకుండా ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాలని సూచించారు.
 
ఇటలీని కరోనా ఎలా పీడిస్తుందో గమనించాలని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వ ఆదేశాలను అక్కడి ప్రజలంతా తొలుత బేఖాతరు చేశారని, అందుకే ఆ పరిస్థితి తలెత్తిందని అన్నారు.
 
ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ప్రకటిస్తారని.. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా దేశంలో ప్రతి వ్యక్తి యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోజూ సమీక్ష జరుపుతున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.
 
జనాభా ఎక్కువగా ఉన్న మన దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్నిరకాల చర్యలు తీసుకొంటున్నట్టుగా కిషన్ రెడ్డి తెలియజేశారు. లాక్ డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు .చైనా మన దేశానికి సరిహద్దులో ఉన్నప్పటికీ మన దేశంలోకి ఆలస్యంగా కరోనా వైరస్ ప్రవేశించిందని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రతి వ్యక్తి స్వీయ నిర్భధం పాటించాల్సిన అవసంరం ఉందని కిషన్ రెడ్డి సూచించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments