Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిమ్ ప్రసంగిస్తుంటే వైద్యులు కంటతడి పెట్టారు.. ఎందుకంటే?

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (19:56 IST)
Kim Jong un
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రసంగిస్తుంటే.. వైద్యులు కంటతడి పెట్టుకున్నారు. చిన్నపిల్లల్లా వెక్కివెక్కి ఏడ్చారు. ఇందుకు సంబంధించి వాట్సాప్ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. 
 
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా సమయంలో కీలక సేవలు అందించిన ఆర్మీ వైద్యులను సన్మానించేందుకు రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కిమ్ ఓ భారీ సభ ఏర్పాటు చేశారు. 
 
ఈ సభలో కిమ్ ప్రసంగిస్తుండగా ఆర్మీ వైద్యులు వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించారు. వారు అలా కన్నీళ్లు పెట్టుకోవడం వెనక కారణం ఉంది. కరోనాను జయించామని కిమ్ ప్రకటించిన తర్వాత ఈ బాధ్యతల నుంచి ఆర్మీ వైద్యులకు విముక్తి కల్పించింది. 
 
కిమ్ సహా వందలామంది కీలక అధికారులు, మిలటరీ వైద్యులు, ఇతర మెడికల్ సిబ్బంది దీనికి హాజరయ్యారు. కిమ్ ప్రసంగిస్తూ వారి సేవలను కొనియాడారు. వారి కష్టాన్ని గుర్తిస్తూ ప్రశంసలు కురిపించారు. 
 
కరోనాపై పోరులో ఉత్తర కొరియా సాధించిన విజయం అద్భుతమని వ్యాఖ్యానించారు. అది విన్న మిలటరీ వైద్యులు, ఇతర అధికారులు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments