Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ పతనం మునుగోడు నుంచే మొదలు.. అమిత్ షా ఫైర్

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (19:36 IST)
Amit shah
తెలంగాణ పర్యటనలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వున్నారు. ఈ సందర్భంగా మునుగోడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలోని కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ పతనం మునుగోడు నుంచే ప్రారంభం కావాలన్నారు. 
 
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సాన్ని ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని అమిత్ షా ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక కేసీఆర్ పతనానికి నాంది అని భావిస్తున్నట్లు చెప్పారు. 
 
కేసీఆర్ అండ్ కంపెనీ.. తెలంగాణను దోచుకుంటోందని అమిత్ షా ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ నిర్మిస్తామన్నారు.. నల్గొండలో ఆస్పత్రి నిర్మించారా అని నిలదీశారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ చెప్పారని.. ఇంతవరకు ఎందుకు చేయలేదో.. దళితులు ఆలోచించాలని సూచించారు.
 
మరోసారి టీఆర్ఎస్ గెలిచినా దళితుడు ముఖ్యమంత్రి కాబోరని.. కేసీఆర్ గానీ.. కేటీఆర్ గానీ సీఎం అవుతారని అమిత్ షా వ్యాఖ్యానించారు. కేసీఆర్ రైతుల వ్యతిరేకి అని అమిత్ షా ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నా.. కేసీఆర్ ఎందుకు ట్యాక్స్ తగ్గించడం లేదని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments