Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసూద్ అజర్‌కు కిడ్నీ వైఫల్యం.. పాక్ సైనిక ఆస్పత్రిలో డయాలిసిస్

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (13:38 IST)
పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్న జైషే మహమ్మద్ (జేఈఎం) వ్యవస్థాపకుడు మసూద్ అజర్ మూత్రపిండాల పనితీరు పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆయనను రావల్పిండిలోని సైనిక ఆస్పత్రికి తరలించి నిత్యం డయాలిసిస్ చేస్తున్నారు. ఈ విషయాన్ని భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. 
 
ప్రస్తుతం మసూద్ అజర్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని, అయితే ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందున ఆయన ఇంటి నుంచి బయటికి రాలేకపోతున్నాడని పాక్ విదేశాంగ మంత్రి గురువారం ప్రకటించిన విషయం విదితమే. మసూద్ అజర్ మూత్రపిండాల వైఫల్యంతో ఇబ్బంది పడుతున్నాడని, ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని సైనిక దవాఖానలో చికిత్స పొందుతూ తరచుగా డయాలిసిస్ చేయించుకుంటున్నాడని ఇటీవల అందిన వార్తలు స్పష్టం చేస్తున్నాయి అని భద్రతాదళానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 
 
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌కు అత్యంత సన్నిహితుడైన మసూద్ అజర్ కాశ్మీరులో జిహాద్‌ను ప్రచారం చేస్తూ 1994లో భారత్‌కు పట్టుబడ్డాడు. అయితే 1999 డిసెంబర్ 31న కాందహార్‌కు హైజాక్ అయిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించుకునేందుకు భారత ప్రభుత్వం మసూద్ అజర్‌ను విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments