Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసూద్ అజర్‌కు కిడ్నీ వైఫల్యం.. పాక్ సైనిక ఆస్పత్రిలో డయాలిసిస్

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (13:38 IST)
పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్న జైషే మహమ్మద్ (జేఈఎం) వ్యవస్థాపకుడు మసూద్ అజర్ మూత్రపిండాల పనితీరు పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆయనను రావల్పిండిలోని సైనిక ఆస్పత్రికి తరలించి నిత్యం డయాలిసిస్ చేస్తున్నారు. ఈ విషయాన్ని భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. 
 
ప్రస్తుతం మసూద్ అజర్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని, అయితే ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందున ఆయన ఇంటి నుంచి బయటికి రాలేకపోతున్నాడని పాక్ విదేశాంగ మంత్రి గురువారం ప్రకటించిన విషయం విదితమే. మసూద్ అజర్ మూత్రపిండాల వైఫల్యంతో ఇబ్బంది పడుతున్నాడని, ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని సైనిక దవాఖానలో చికిత్స పొందుతూ తరచుగా డయాలిసిస్ చేయించుకుంటున్నాడని ఇటీవల అందిన వార్తలు స్పష్టం చేస్తున్నాయి అని భద్రతాదళానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 
 
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌కు అత్యంత సన్నిహితుడైన మసూద్ అజర్ కాశ్మీరులో జిహాద్‌ను ప్రచారం చేస్తూ 1994లో భారత్‌కు పట్టుబడ్డాడు. అయితే 1999 డిసెంబర్ 31న కాందహార్‌కు హైజాక్ అయిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించుకునేందుకు భారత ప్రభుత్వం మసూద్ అజర్‌ను విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments