Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన రాక్షస కొడుకు

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (13:24 IST)
ఆస్తిపంచి ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి రాక్షసుడుగా మారిపోయాడు. తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణం ఆనంతపురం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లాలోని కనేల్ అనే ప్రాంతానికి చెందిన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి తన తల్లిదండ్రులను ఆస్తి పంచి ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ వచ్చాడు. అయితే, అతని మాటలను ఆ తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
దీంతో ఆగ్రహించిన మధుసూదన్ రెడ్డి... తల్లి నరసమ్మ, తండ్రి నారాయణ రెడ్డిలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో మంటలకు హాహాకారాలు చేస్తూ తల్లి అక్కడికక్కడే చనిపోయింది. తండ్రి తీవ్రంగా గాయపడి కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనను చూసి చుట్టుపక్కలవారు వెంటనే మంటలను ఆర్పి... నారాయయణ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. 
 
ఇకపోతే, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నారాయణరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో కుటుంబ సభ్యులు మరింత మెరుగైన చికిత్స కోసం బళ్లారి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై నారాయణరెడ్డి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మధుసూదన్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

Eleven review :నవీన్ చంద్ర నటించిన ఎలెవెన్ చిత్ర సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments