Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన రాక్షస కొడుకు

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (13:24 IST)
ఆస్తిపంచి ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి రాక్షసుడుగా మారిపోయాడు. తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణం ఆనంతపురం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లాలోని కనేల్ అనే ప్రాంతానికి చెందిన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి తన తల్లిదండ్రులను ఆస్తి పంచి ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ వచ్చాడు. అయితే, అతని మాటలను ఆ తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
దీంతో ఆగ్రహించిన మధుసూదన్ రెడ్డి... తల్లి నరసమ్మ, తండ్రి నారాయణ రెడ్డిలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో మంటలకు హాహాకారాలు చేస్తూ తల్లి అక్కడికక్కడే చనిపోయింది. తండ్రి తీవ్రంగా గాయపడి కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనను చూసి చుట్టుపక్కలవారు వెంటనే మంటలను ఆర్పి... నారాయయణ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. 
 
ఇకపోతే, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నారాయణరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో కుటుంబ సభ్యులు మరింత మెరుగైన చికిత్స కోసం బళ్లారి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై నారాయణరెడ్డి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మధుసూదన్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments