కాశ్మీర్‌లో జమాతే ఆస్తులు సీజ్

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (13:12 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జమాతే ఇస్లామీ (జేఈఐ) సంస్థకు చెందిన ఆస్తులన్నీ అధికారులు సీజ్ చేశారు. ఉగ్రవాదులకు ఊతమిస్తున్న వేర్పాటువాద సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, దశాబ్దాలుగా కాశ్మీర్‌ లోయలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తూ, గట్టి పట్టున్న జమాతే ఇస్లామీ (జేఈఐ) సంస్థపై కఠిన చర్యలు తీసుకుంది. ఇందులోభాగంగా, ఆ సంస్థకు చెందిన ఆస్తులను సీజ్ చేసింది. 
 
శ్రీనగర్, ఇతర ప్రాంతాల్లోని జమాతే ఆ సంసంస్థకు చెందిన సంస్థలు, కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించిన అధికారులు సుమారు 70 ఆస్తుల్ని సీజ్ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నదనే ఆరోపణలతో జమాతే సంస్థపై కేంద్ర హోంశాఖ ఐదేళ్ళపాటు నిషేధం విధించిన విషయం తెల్సిందే. గత నాలుగు రోజుల్లోనే ఆ సంస్థకు చెందిన 200 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments