Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి షాక్ : కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎంపీ

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (12:57 IST)
ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో అధికార బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. బీజేపీ ఎంపీ సావిత్రి బాయి పూలే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆమె గతంలోనే కమలం పార్టీకి రాజీనామా చేశారు. అలాగే, కాషాయం పార్టీపై చాలా సార్లు బహిరంగ విమర్శలు  కూడా చేశారు. 
 
ఆమెతో పాటు సమాజ్‌వాదీ పార్టీ నేత రాకేశ్‌ కూడా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, జ్యోతిరాధిత్య సింధియా సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. గతేడాది బీఆర్‌ అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 
 
బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా ఆమెకు సాన్నిహిత్యం ఉంది. 2000 సంవత్సరంలో బీజేపీలో చేరిన‌ పూలే 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఆమె 2014 సాధారణ ఎన్నికల్లో బహ్రైచ్‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌సభకు ఎంపికయ్యారు. 

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments