Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల కోసం తెరాసలో చేరుతున్నా : ఎమ్మెల్యే సండ్ర

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (12:41 IST)
ప్రజల కోసం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెరాసలో పార్టీ చేరనున్నట్టు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రకటించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తాను టీడీపీ రాజీనామా చేసి త్వరలోనే తెరాస చేరబోతున్నట్లు తెలిపారు. దీంతో ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జోరందుకుంది. 
 
ప్రజల అవసరాలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు సండ్ర తెలిపారు. కేసులకు భయపడే వ్యక్తిని అయితే ఎప్పుడో పార్టీ మారేవాడినని స్పష్టంచేశారు. ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి చేయడం కష్టంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 
 
తెరాసలో చేరిక తేదీపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. తాజాగా సండ్ర పార్టీ మారితే టీడీపీకి తెలంగాణలో మెచ్చ నాగేశ్వరరావు (అశ్వారావు పేట) ఏకైక ఎమ్మెల్యేగా మిగలనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments