Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాలిచ్చే ఆవు ఒరిస్కాకు.. పొడిచే గేదె ఆంధ్రాకు... టీడీపీ నేతల సెటైర్లు

Advertiesment
Vizag railway zone
, శుక్రవారం, 1 మార్చి 2019 (14:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్టణాన్ని కేంద్రంగా చేసుకుని సౌత్ కోస్ట్ పేరుతో ఓ రైల్వే జోన్‌ను ప్రకటించింది. ఈ జోన్ ఏర్పాటుపై ఏపీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఈ రైల్వే జోన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వారు అంటున్నారు. 
 
తాజాగా ఈ ప్రకటనపై రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్ బోర్డు ఛైర్మన్, టీడీపీ నేత నాగుల్‌ మీరా స్పందిస్తూ, ఒక నియంత ఏపీలో మరోసారి అడుగుపెడుతున్నారని ఆరోపించారు. శవాల మీద చిల్లర వేరుకునే రీతిలో మోడీ పర్యటన ఉందన్నారు. బీజేపీ రైల్వే జోన్‌ని రాజకీయ కోణంలో చూస్తోంది. పాలిచ్చే ఆవును ఒరిస్సాకి ఇచ్చి.. పొడిచే గేదెను ఏపీకి ఇచ్చినట్టుగా ఉందన్నారు. 
 
ముఖ్యంగా, ఘన చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను ముక్కలు చేసి విశాఖ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నిజం చెప్పాలంటే ఇది రైల్వే జోన్ కానీ ఒక మాయాజోన్ అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ జోన్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందన్నారు. ఈ జోన్ ఏర్పాటుతో వాల్తేరు డివిజన్‌లో పని చేసే వేలాది మంది రైల్వే ఉద్యోగులు బదిలీ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీ భద్రత మధ్య భారత్‌కు అభినందన్... పాక్ అలా చేసింది...