Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయేల్‌లో వ్యాక్సిన్ పంపిణీ - టీకా వేయించుకున్న బెంజిమన్‌

Webdunia
ఆదివారం, 20 డిశెంబరు 2020 (11:23 IST)
ఇజ్రాయేల్‌ దేశంలో కరోనా వ్యాక్సినేషన్ అధికారికంగా ప్రారంభమైంది. ఫార్మా దిగ్గజం ఫైజర్ బయో‌ఎన్‌టెక్ అభివృద్ధి చేసిన టీకాల పంపిణీకి ఆ దేశం శ్రీకారం చుట్టింది. ఈ వ్యాక్సిన్‌లో భాగంగా, తొలి టీకాను ఆ దేశ ప్రధానమంత్రి బెంజిమెన్ నెతన్యాహూ స్వీకరించారు. తద్వారా దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టయింది. 
 
ఆ దేశ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు తొలి టీకా వేయించుకున్నారు. ఫలితంగా టీకా తీసుకున్న తొలి ఇజ్రాయెలీగా ఆయన రికార్డులకెక్కారు. అంతేకాదు, టీకా వేయించుకోవడం ద్వారా వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న భయాందోళనలను పారదోలే ప్రయత్నం చేశారు. 
 
ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ చిన్న ఇంజెక్షన్ ద్వారా ఎంతోమంది ఆరోగ్యాలను రక్షించవచ్చన్నారు. దీనిని పెద్ద ముందడుగుగా అభివర్ణించారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, ఇప్పటివరకు ఇజ్రాయెల్ వ్యాప్తంగా 3.72 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 3,070 మంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments