Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు మందు కనిపెట్టాం: డిస్ట్రిబ్యూటెడ్‌ బయో

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (11:22 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నుంచి మానవాళిని కాపాడే ఔషధాన్ని తాము తయారు చేశామని అమెరికాలోని, కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న డిస్ట్రిబ్యూటెడ్‌ బయో కంపెనీ ప్రకటించింది.

ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్‌ జాకబ్‌ గ్లాన్‌ విల్లె వెల్లడించారు. గతంలో సార్స్‌ వైరస్‌ ను నిర్వీర్యం చేసేందుకు ఉపయోగించిన యాంటీ బాడీస్‌ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు.

ఐదుగురితో కూడిన తన బృందం కరోనా వైరస్‌పై విజయం సాధించిందని, సార్స్‌ ను అంతం చేసిన యాంటీ బాడీస్ కరోనాపైనా పని చేశాయని, డాక్టర్‌ జాకబ్‌ పేర్కొన్నారు.

వాస్తవానికి కరోనా వైరస్‌ మానవ శరీరంలోని ఎస్‌ - ప్రొటీన్‌ కణాల ద్వారా ప్రవేశిస్తుందని, తాము ప్రయోగించిన యాంటీ బాడీస్, ఎస్‌ - ప్రొటీన్‌ ను నిర్వీర్యం చేస్తున్నాయని, తద్వారా కరోనా వైరస్‌ కూడా నాశనం అవుతోందని ఆయన అన్నారు.

ప్రస్తుతం మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్న వాక్సిన్, సెప్టెంబర్‌ నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశామని వెల్లడించారు. తమ ప్రయోగ ఫలితాలను మరో రెండు ల్యాబ్స్ సాయంతో నిర్ధారించుకుంటున్నామని జాకబ్ గ్లాన్‌ విల్లె వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments