Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో 132కి చేరిన కరోనా కేసుల సంఖ్య

ఏపీలో 132కి చేరిన కరోనా కేసుల సంఖ్య
, గురువారం, 2 ఏప్రియల్ 2020 (10:52 IST)
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే 21 మందికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయింది. గుంటూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కరోనా సోకిన వారిలో దిల్లీ వెళ్లొచ్చిన వారే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. తాజా కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 132కు చేరింది.

దిల్లీలో మతపరమైన సమావేశానికి హాజరై వచ్చినవారు, వారి సన్నిహితుల వల్లే కేసులు ఇంత భారీగా పెరిగినట్లు అధికారిక సమాచారం. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగినవారు వీరిలో ఉన్నారు. దిల్లీ నుంచి వచ్చిన వారి వల్ల రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరగటంతో యంత్రాంగం అప్రమత్తమైంది.

దిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారి కోసం అన్ని జిల్లాల్లో జల్లెడ పడుతోంది. ఇలాంటి వారు 1085 మంది ఉన్నారని, వారిలో 21 మందిని తప్ప మిగతా అందరినీ గుర్తించామని ముఖ్యమంత్రి జగన్ బుధవారం సాయంత్రం ప్రకటించారు.

ప్రభుత్వం వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తోంది. లక్షణాలు ఉన్నా... లేకపోయినా వారందరికీ వ్యాధి నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తోంది.

ఏపీ లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు. జిల్లాల వారీగా...
 
కృష్ణా లో 15
గుంటూరు లో 20
ప్రకాశం లో 17
కడప లో 15
చిత్తూరు లో 8
విశాఖలో 11
అనంతపురంలో 2
నెల్లూరు లో 20
కర్నూల్ లో 1
పగో లో  14
 
శ్రీకాకుళం, విజయనగరం లో నమోదు కాని కరోనా పాజిటివ్ కేసులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా మహమ్మారి.. స్పెయిన్‌లో లక్ష కరోనా పాజిటివ్ కేసులు