Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మందుబాబులను 'ఏప్రిల్ ఫూల్స్' చేసిన వైన్ షాపు

Advertiesment
Wine shop
, బుధవారం, 1 ఏప్రియల్ 2020 (20:38 IST)
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అన్ని మద్యం దుకాణాలు మూసేశారు. అప్పటి నుంచి మందు బాబులు 'దాహం'తో పిచ్చెక్కిపోతున్నారు.

అయితే కర్ణాటకలో ఓ వైన్ షాపు ఏప్రిల్ 1న మద్యం అమ్మనున్నట్లు తెలిసింది. అంతే పెద్ద సంఖ్యలో దుకాణం ఎదుట క్యూ కట్టారు.

తీరా నిజం తెలిశాక వారు పడిన బాధ అంతా ఇంతా కాదు. గడగ్ పట్టణంలో బుధవారం మద్యం దుకాణాలు తెరుచుకుంటాయనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

అంతే చుట్టుపక్కల ప్రాంతాల్లోని మందు బాబులంతా ములగంద్ రోడ్డు సమీపంలోని వైన్ షాపు ఎదుట క్యూ కట్టారు. అది కూడా ఎలాంటి తోపులాట లేకుండా.. క్రమశిక్షణ పాటిస్తూ నిలబడ్డారు.

వీరిలో మహిళలు, యువత, వృద్ధులు కూడా ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మద్యం దుకాణం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇదంతా అబద్దం అని తెలిశాక.. పాపం మందు బాబులంతా నిరాశతో వెనుతిరిగారు.

మద్యం లేక మృతి ఇటీవలే లాక్డౌన్తో మందు దొరక్కపోవడం వల్ల.. చాలా మంది మద్యం ప్రియులు ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఘటనలు ఎక్కువగా జరిగాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళిసైతో కేసీఆర్‌ భేటీ