Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనస్ 17 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో బికినీ ధరించి ఈతకొట్టింది..

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (14:22 IST)
సాధారణంగా ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదైతే, చలి తీవ్రత ఎక్కువగా ఉండటమే కాదు అందుకు తగు జాగ్రత్తలు కూడా మనం తీసుకుంటాం. అయితే కజికిస్థాన్ దేశానికి చెందిన ఓ యువతి మాత్రం మంచు గడ్డలా ఉన్న కాస్పియన్ సముద్రంలో బికినీ ధరించి మరీ ఈత కొట్టింది. అది కూడా మైనస్ 17 డిగ్రీల చలిలో వినడానికే వింతగా ఉన్నా నిజమండీ బాబూ. 
 
జరీనా ఆండ్రీవుషీనా అనే యువతి కాస్పియన్ సముద్రపు తూర్పు తీరంలో గల అక్టవు అనే ప్రాంతంలో నివసిస్తోంది. ఆమె ఇంటి నుండి సముద్రానికి చేరుకోవడానికి 5 నిమిషాలు మాత్రమే పడుతుందట. అందుకే ఎంత చలిగా ఉన్నా సరే గత రెండేళ్లుగా ఇలానే స్విమ్ చేస్తోందట. కాగా తాను అలా బికినీలో ఈత కొడుతున్నప్పుడు తీసుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తను పోస్ట్ చేసింది. అంతేకాదు ఆరోజు ఉష్ణోగ్రత మైనస్ 17 డిగ్రీల సెల్సియస్ ఉందంట. మంచు గడ్డల మధ్యలో ఈతకొట్టడం ఒక ప్రత్యేకానుభూతిని కలిగిస్తోంది అంటూ పేర్కొంది. కాగా జరీనా సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది.
 
ఉదయాన్నే జాగింగ్ చేసిన తర్వాత ఐస్-వాటర్‌లో మునగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, తనను ఆరోగ్యవంతమైన వ్యక్తిగా మార్చిందంటూ 33 సంవత్సరాలు వయస్సు ఉన్న ఓ మహిళ తెలిపింది. అయితే ఇలాంటి వ్యాయామం రష్యా మరియు దాని పరిసర దేశాల్లో బాగా జనాదరణ పొందినవి అంటూ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments