అమ్మో.. మూడేళ్ల చెడిన మాంసాన్ని ఆ రెస్టారెంట్లో వడ్డించారా.. తిని ఇద్దరి మృతి..

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (10:48 IST)
వీకెండ్ అయితే చాలు రెస్టారెంట్లకు వెళ్లడం ఫ్యాషనైపోయింది. కానీ వార్త చదివితే మాత్రం రెస్టారెంట్లకు వెళ్లాలంటే.. ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వుంటుంది. పాకిస్థాన్‌కు చెందిన ఓ రెస్టారెంట్‌లో కుళ్లిన మాంసంతో వంటలు చేశారు. ఈ వంటలను ఆరగించిన ఇద్దరు మైనర్లు మృతి చెందారు. ఈ ఘటన పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కరాచీలోని ఆరిజోనా గ్రిల్ రెస్టారెంట్‌లో ఇటీవల కొందరు భోజనం చేశారు. వెంటనే వారంతా అస్వస్థతకు లోనుకాగా, కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. మరణించిన ఇద్దరు భుజించిన మాంసం మూడేళ్ల క్రితం నాటిదని అధికారులు గుర్తించారు. 
 
కుళ్లిపోయిన మాంసాన్ని రెస్టారెంట్ నిర్వాహకులు వేడిచేసి మరీ వినియోగదారులకు వడ్డిస్తున్నారని తేలింది. దీంతో బరిలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు 80 కిలోల చెడిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2015 సమయంలో ఈ ప్యాకేజ్డ్ మాంసాన్ని రెస్టారెంట్ యజమానులు కొనుగోలు చేశారని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. హోటల్‌ను సీజ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments