Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో.. మూడేళ్ల చెడిన మాంసాన్ని ఆ రెస్టారెంట్లో వడ్డించారా.. తిని ఇద్దరి మృతి..

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (10:48 IST)
వీకెండ్ అయితే చాలు రెస్టారెంట్లకు వెళ్లడం ఫ్యాషనైపోయింది. కానీ వార్త చదివితే మాత్రం రెస్టారెంట్లకు వెళ్లాలంటే.. ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వుంటుంది. పాకిస్థాన్‌కు చెందిన ఓ రెస్టారెంట్‌లో కుళ్లిన మాంసంతో వంటలు చేశారు. ఈ వంటలను ఆరగించిన ఇద్దరు మైనర్లు మృతి చెందారు. ఈ ఘటన పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కరాచీలోని ఆరిజోనా గ్రిల్ రెస్టారెంట్‌లో ఇటీవల కొందరు భోజనం చేశారు. వెంటనే వారంతా అస్వస్థతకు లోనుకాగా, కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. మరణించిన ఇద్దరు భుజించిన మాంసం మూడేళ్ల క్రితం నాటిదని అధికారులు గుర్తించారు. 
 
కుళ్లిపోయిన మాంసాన్ని రెస్టారెంట్ నిర్వాహకులు వేడిచేసి మరీ వినియోగదారులకు వడ్డిస్తున్నారని తేలింది. దీంతో బరిలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు 80 కిలోల చెడిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2015 సమయంలో ఈ ప్యాకేజ్డ్ మాంసాన్ని రెస్టారెంట్ యజమానులు కొనుగోలు చేశారని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. హోటల్‌ను సీజ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments